News August 14, 2025
మంచిర్యాల జిల్లాలో మంత్రి వర్సెస్ MLA

జిల్లాలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల వేడి రాజుకుంది. ఈనెల 19న పోలింగ్ జరుగనుండగా బరిలో ఉన్న అభ్యర్థులు కార్మిక వాడల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. మంత్రి వివేక్ వర్గం నుంచి విక్రమ్రావు, మంచిర్యాల ఎమ్మెల్యే మద్దతుతో సత్యపాల్రావు, ప్రధాన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యే మధ్య నెలకొన్న కోల్డ్ వార్తో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇరువర్గాల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది.
Similar News
News April 17, 2026
సిరిసిల్ల: ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయిన్పల్లి మండలంలోని వరదవల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లంపట్ల ఎల్లయ్య (71) ఇటీవల అప్పులు చేసి నూతన ఇంటిని నిర్మించాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో శుక్రవారం ఇంటి మెట్ల వద్ద ఉరివేసుకున్నాడు. మృతుడి కుమారుడు దుర్గయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 17, 2026
‘జిమ్’ దుస్తులతో డేంజర్

జిమ్కు వెళ్లేవారు కంఫర్ట్ కోసం టైట్గా ఉండే సింథటిక్(Activewear) దుస్తులను వాడటం పెరిగింది. అయితే ఆ దుస్తుల్లో వాడే థాలేట్స్ అనే రసాయనాలు హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘బ్రీతబిలిటీ లేకపోవడం వల్ల బాడీ టెంపరేచర్ పెరిగి చర్మంపై ఒత్తిడి పెరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, రాషెస్ వస్తాయి. అందువల్ల వదులుగా ఉండే కాటన్ దుస్తులు వాడటం మంచిది’ అని సూచిస్తున్నారు.
News April 17, 2026
హార్ముజ్ ఓపెన్ చేశాం: ఇరాన్

క్రూడ్ ఆయిల్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచానికి ఇరాన్ ఊరటనిచ్చింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ట్వీట్ చేశారు. లెబనాన్తో ఇజ్రాయెల్ సీజ్ఫైర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీజ్ఫైర్ అమలులో ఉన్నంత <<19668983>>కాలం<<>> (మరో 9 రోజులు) జలసంధి తెరిచే ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటనతో ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోయాయి.


