News August 14, 2025
RMG: 495 ట్రిప్పుల ఇసుకకు వేలం.. రూ.14లక్షల ఆదాయం

ఇటీవల రామగుండం అర్బన్ పరిధిలోని జనగామ, ఇందిరమ్మ కాలనీ, ఎన్టీపీసీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సమీపంలో 3 అక్రమ ఇసుక డంపుల్లో 495 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఈ ఇసుకకు MRO శ్రీపాద ఈశ్వర్ వేలం నిర్వహించారు. కనీస ధర రూ.560గా నిర్ణయించి వేలం చేపట్టారు. KNRకు చెందిన ఓ వ్యాపారి ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.2.830 చొప్పన వేలం పాడారు. దీంతో ప్రభుత్వానికి రూ.14లక్షల ఆదాయం సమకూరింది.
Similar News
News April 19, 2026
ఖమ్మం: హారన్ కొట్టారని.. కండక్టర్పై యువకుడి దాడి

రహదారిపై వెళ్తుండగా సైడ్ ఇవ్వాలని హారన్ కొట్టినందుకు ఓ యువకుడు ఏకంగా ఆర్టీసీ బస్సునే అడ్డుకుని హల్చల్ చేశాడు. నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. డ్రైవర్ రాంబాబుతో వాగ్వివాదానికి దిగిన సదరు యువకుడు, కండక్టర్ మంజుల ఫోన్ లాక్కొని దురుసుగా ప్రవర్తించాడు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసిన నిందితుడిని నేలకొండపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News April 19, 2026
వీళ్లు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగొద్దు!

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.
News April 19, 2026
MGU: పరీక్షల షెడ్యూల్ విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2, 4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్స్ను అధికారక ఎంజీయూ వెబ్సైట్లో ఉంచామన్నారు.


