News April 1, 2024

ధర్మవరంలో గెలుపెవరిదో?

image

సిల్క్ సిటీ ఆఫ్ AP.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్, TDP 5 సార్లు, YCP ఒకసారి గెలుపొందాయి. ఈసారి పొత్తులో భాగంగా ఈ సెగ్మెంట్‌లో BJP పోటీ చేస్తోంది. YCP నుంచి మరోసారి బరిలో నిలిచిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. మూడోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా ధర్మవరాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని BJP ఉవ్విళ్లూరుతోంది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 22, 2026

ఆ 2 గంటలు చాలా ముఖ్యం!

image

<<19446288>>సైబర్<<>> మోసాలకు గురైతే ఆందోళన చెందకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే <>CyberCrime.gov.in<<>> పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ లేదా కార్డులను వెంటనే బ్లాక్ చేయించి, మోసపూరిత లావాదేవీ గురించి బ్యాంకుకు సమాచారం అందించాలి. మోసం జరిగిన మొదటి 1-2 గంటల్లో కంప్లైంట్ ఇవ్వగలిగితే మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

News March 22, 2026

TN పడవలు రాకుండా చూడండి.. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ

image

AP: తమిళనాడు మత్స్యకార పడవలు ఏపీ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నాయని కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలకు రాష్ట్ర మత్స్య శాఖ లేఖ రాసింది. దీని వల్ల 162 తీర గ్రామాలకు చెందిన స్థానిక మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొంది. TN పడవల రాక ఇక్కడి వారి జీవనానికి ముప్పుగా మారిందని తెలిపింది. త్వరగా స్పందించి అవి AP సముద్ర జలాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది.

News March 22, 2026

సమ్మర్‌లో చికెన్ తింటున్నారా?

image

సమ్మర్‌లో మితంగా చికెన్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఇది అధిక ప్రొటీన్ కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమై శరీర వేడిని పెంచుతుంది. దీంతో తలనొప్పి, కళ్ల మంటలు, కండరాల నొప్పులు, విపరీతంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చికెన్‌ను వారానికి ఒకసారి తింటే ఓకే కానీ రెండుమూడు సార్లు తీసుకుంటే బరువు పెరుగుతారు’ అని హెచ్చరిస్తున్నారు.