News August 14, 2025
కృష్ణా, ఎన్టీఆర్ ప్రజలకు సెప్టెంబర్ 2 వరకు అవకాశం

కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్లు మార్పుపై ప్రజలు వినతులు సమర్పించవచ్చని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 2 వరకు అభ్యర్థనలు స్వీకరించనున్నట్టు చెప్పారు. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కైకలూరును కృష్ణాలో, పెనమలూరు, గన్నవరం, నూజివీడును విజయవాడలో జగ్గయ్యపేట, నందిగామలను NTR జిల్లాలోనే ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్.
Similar News
News April 20, 2026
జగిత్యాల: 1230 రోజుల తర్వాత ‘గులాబీ బాస్’ పర్యటన

దాదాపు 1230 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల పర్యటనకు రానున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పర్యటించిన ఆయన, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులకు నాంది పలుకుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ రాకతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
News April 20, 2026
సీఎం చంద్రబాబుపై సినిమా

AP: సీఎం చంద్రబాబు జీవితం, పరిపాలనా విశేషాలతో ‘ధర్మచక్రం’ సినిమాను నిర్మించినట్లు దర్శక, నిర్మాత పసుపులేటి వెంకట రమణ వెల్లడించారు. CBN బర్త్ డే సందర్భంగా ఇవాళ 13 జిల్లాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న సేవలను, ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఇందులో వాస్తవాలను చూపించామని పేర్కొన్నారు.
News April 20, 2026
చేతికి రెండు ఫ్రాక్చర్లు.. అయినా మూడు వికెట్లు

ఫామ్ లేమితో సతమతమైన KKR స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు నిన్న RRతో జరిగిన మ్యాచ్లో కమ్బ్యాక్ ఇచ్చారు. 4 ఓవర్లు వేసి 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అయితే IPL సీజన్కు ముందు తాను గాయపడ్డట్లు వరుణ్ తెలిపారు. ఇప్పటికీ లెఫ్ట్ హ్యాండ్లో 2 ఫ్రాక్చర్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఆ నొప్పితోనే బౌలింగ్ చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని అధిగమించడానికే ట్రై చేస్తున్నట్లు తెలిపారు.


