News August 14, 2025
భద్రాచలం: సీతారామచంద్ర స్వామివారి నిత్యకళ్యాణం

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకళ్యాణ మహోత్సవం గురువారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. సుప్రభాతం, తోమాల సేవ అనంతరం స్వామివారి, అమ్మవారి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, మంగళహారతులతో భక్తిపూర్వకంగా మారింది.
Similar News
News August 16, 2025
గౌరవరంలో తేలుకుట్టి బాలుడి మృతి

కావలి మండలం గౌరవరానికి చెందిన చౌటూరి చిన్నయ్య కుమారుడు శ్రీనివాసులు (11) శనివారం తేలు కుట్టి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బాలుడు తమ ఇంటి వెనుక ఉన్న తాటి చెట్టుఎక్కి తాటిపండు కోస్తుండగా తేలు కుట్టింది. అతన్ని కావలి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరు రెఫర్ చేశారు. బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటపై రూరల్ పోలీస్లు కేసు నమోదు చేశారు.
News August 16, 2025
పిల్లల్ని కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ!

కృత్రిమ గర్భంతో పిల్లల్ని కనే రోబోను చైనా అభివృద్ధి చేస్తోంది. సింగపూర్ నాన్యాంగ్ వర్సిటీ సైంటిస్ట్ డా.జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ‘ప్రెగ్నెన్సీ రోబో’ను పరిశోధకులు డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఆర్టిఫీషియల్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ను ప్రవేశపెట్టి, ట్యూబ్ ద్వారా న్యూట్రియెంట్స్ అందిస్తారు. 9 నెలల్లో శిశువు తయారవుతుంది. 2026 నాటికి రోబో నమూనా తయారవుతుందని, ఇందుకోసం ₹12.96L ఖర్చవుతుందని చెబుతున్నారు.
News August 16, 2025
సుంకాలపై మారిన ట్రంప్ వైఖరి!

పుతిన్తో భేటీ ముగిశాక ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై ప్రస్తుతం సెకండరీ టారిఫ్స్ విధించే అవసరం లేదు. 2-3 వారాల్లో దీనిపై మరోసారి ఆలోచిస్తా’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం ఇండియా దిగుమతులపై 25% టారిఫ్ అమలవుతోంది. అదనంగా మరో 25% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. ట్రంప్ ప్రకటనతో ఈ టారిఫ్స్ నిలిచిపోయే అవకాశం ఉంది.