News August 14, 2025

సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు: అయ్యన్నపాత్రుడు

image

AP: సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. YCP వాళ్లు వస్తారో? లేదో? క్లారిటీ ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న జగన్ అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. ‘అసెంబ్లీకి జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా? సభకు వచ్చి సమస్యలు అడగాల్సిన బాధ్యత లేదా? YCP ప్రభుత్వంలో ఐదేళ్లలో 78 రోజులే సభను నడిపించారు’ అని విమర్శించారు.

Similar News

News August 14, 2025

UPIలో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలు బంద్

image

సైబర్ నేరాలను అరికట్టేందుకు NPCI అక్టోబర్ 1 నుంచి UPI సేవల్లో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలను నిలిపేయనుంది. సాధారణంగా నగదు పంపేందుకు UPI పిన్ ఎంటర్ చేయాలి. అయితే కేటుగాళ్లు ఖాతాలో నగదు జమ చేస్తామని పిన్ ఎంటర్ చేయించి నగదు దోచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఫోన్ పే, గూగుల్ పే, తదితర యూపీఐ యాప్స్ ద్వారా ఫ్రెండ్స్, సన్నిహితులకు డబ్బు చెల్లించమనే రిక్వెస్ట్ పంపడం కుదరదు.

News August 14, 2025

Op సిందూర్‌లో పాల్గొన్న 36 ఎయిర్ వారియర్స్‌కు గ్యాలంట్రీ అవార్డులు

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న 36 ఎయిర్ వారియర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ అవార్డులు ప్రకటించింది. ఇందులో 9 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ ఆఫీసర్లకు వీర్ చక్ర మెడల్స్, 26 మందికి వాయుసేన మెడల్స్, ఒకరికి శౌర్య చక్ర పతకాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ జరిపిన దాడుల్లో వీరు కీలక పాత్ర పోషించారు.

News August 14, 2025

Asia Cup: SKY లేకుండానే భారత జట్టు?

image

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును మరో వారంలో ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ జపాన్ పర్యటనకు వెళ్లడం పలు సందేహాలకు తావిస్తోంది. ఆయన జపాన్‌కు వ్యక్తిగత పనులపై వెళ్లారా? లేదా ఏదైనా గాయానికి చికిత్స తీసుకునేందుకు వెళ్లారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో స్కై లేకుండానే ఆసియా కప్‌కు BCCI జట్టును ప్రకటిస్తుందనీ వార్తలొస్తున్నాయి.