News August 14, 2025
భద్రాద్రి: మావోయిస్టు పార్టీ దళ సభ్యుల లొంగుబాటు

నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ స్థాయిలో పనిచేసిన ఆరుగురు దళ కమిటీ సభ్యులు గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలో భాగంగా వారు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని చెప్పారు. మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు.
Similar News
News August 14, 2025
WNP: లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ-అదనపు కలెక్టర్

రెండో విడత లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం జిల్లాలో 98 మందిని ఎంపిక చేసినట్లు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ తెలిపారు. ఈనెల 18 నుంచి 50 రోజులపాటు తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 98490 81489 సంప్రదించాలన్నారు.
News August 14, 2025
సిద్దిపేట: అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

అధిక వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.హైమావతి సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో కలిసి అధిక వర్షాల వలన ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో 29 నీటి వనరులు పూర్తి స్థాయిలో నిండాయని తెలిపారు.
News August 14, 2025
జిల్లాలో పెరిగిన భూగర్భ జల నీటిమట్టం: కలెక్టర్

గతేడాదితో పోలిస్తే ఈసారి జిల్లాలో భూగర్భ జలమట్టం సగటున 2.26 మీటర్ల మేర పెరిగిందని కలెక్టర్ పి.అరుణ్ బాబు సీఎం చంద్రబాబుకు వివరించారు. సాగునీటి సబ్మెగా సభ్యులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ సాగర్ ఛైర్మన్ కాంతారావుతో కలిసి పాల్గొన్నారు. భారీగా చేపడుతున్న ఫారం పాండ్ నిర్మాణాల కారణంగా వచ్చే ఏడాదికీ జలమట్టం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.