News April 1, 2024

కచ్చతీవు ద్వీపం వ్యవహారం ఏంటి?

image

ఎన్నికల ప్రచారంలో తాజాగా ప్రధాని మోదీ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై విరుచుకుపడ్డారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇవ్వడాన్ని గుర్తు చేశారు. అప్పగింతకు ముందు 1968లోనే ఈ భూభాగాన్ని తమ మ్యాప్‌లో చూపించిన శ్రీలంక ప్రధానితో ఇందిర మాట్లాడటం రాజకీయంగా దుమారం రేపింది. అలా 285ఎకరాల ద్వీపాన్ని సముద్ర ఒప్పందం కింద అప్పగించడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Similar News

News January 28, 2026

దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు

image

TG: పార్టీ ఫిరాయింపు కేసులో MLA దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. గతంలో ఇచ్చిన నోటీసులకు కూడా రిప్లై ఇవ్వలేదు. తాజాగా ఆయనను విచారణకు పిలవాలని స్పీకర్ నిర్ణయించారు. దానం విచారణ తర్వాత SCకి స్పీకర్ రిప్లై ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు MLAలకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

News January 28, 2026

డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

image

కాన్పు తర్వాత చాలామంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్ల మార్పులు, బరువు పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్ వాడడం, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులు ఎత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

News January 28, 2026

బడ్జెట్‌పై BJP అవగాహన సదస్సులు

image

కేంద్ర బడ్జెట్‌పై FEB1 నుంచి దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని BJP నిర్ణయించింది. బడ్జెట్‌ నిర్ణయాలు, వాటి ప్రభావాన్ని ప్రజలకు తెలపనుంది. పదేళ్లలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్‌పై ప్రభుత్వ చర్యలను వివరించనుంది. కేంద్రమంత్రులు, MPలు, రాష్ట్ర నేతలను వీటిలో భాగస్వాములను చేయనుంది. దీనికోసం దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా Ex MP GVL నర్సింహారావును నియమించింది.