News August 14, 2025

BIG ALERT: ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు

image

AP: అతి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, యానాం ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని సూచించింది.

Similar News

News August 14, 2025

‘మహావతార్ నరసింహ’కు భారీగా కలెక్షన్లు

image

యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ విడుదలై 20 రోజులైనా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.236.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.15కోట్లు, భారత్‌లో రూ.221.25 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఇవాళ రెండు పెద్ద సినిమాలు(వార్-2, కూలీ) విడుదలైనా బుక్ మై షోలో ఈ మూవీకి గంటకు 6.56k+ టికెట్లు బుక్ అవుతుండటం గమనార్హం.

News August 14, 2025

UPIలో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలు బంద్

image

సైబర్ నేరాలను అరికట్టేందుకు NPCI అక్టోబర్ 1 నుంచి UPI సేవల్లో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలను నిలిపేయనుంది. సాధారణంగా నగదు పంపేందుకు UPI పిన్ ఎంటర్ చేయాలి. అయితే కేటుగాళ్లు ఖాతాలో నగదు జమ చేస్తామని పిన్ ఎంటర్ చేయించి నగదు దోచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఫోన్ పే, గూగుల్ పే, తదితర యూపీఐ యాప్స్ ద్వారా ఫ్రెండ్స్, సన్నిహితులకు డబ్బు చెల్లించమనే రిక్వెస్ట్ పంపడం కుదరదు.

News August 14, 2025

Op సిందూర్‌లో పాల్గొన్న 36 ఎయిర్ వారియర్స్‌కు గ్యాలంట్రీ అవార్డులు

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న 36 ఎయిర్ వారియర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ అవార్డులు ప్రకటించింది. ఇందులో 9 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ ఆఫీసర్లకు వీర్ చక్ర మెడల్స్, 26 మందికి వాయుసేన మెడల్స్, ఒకరికి శౌర్య చక్ర పతకాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ జరిపిన దాడుల్లో వీరు కీలక పాత్ర పోషించారు.