News August 14, 2025
నంద్యాలలో వెలుగులోకి నకిలీ లెటర్ల మోసం?

నంద్యాల కేంద్రంగా టీటీడీ దర్శనం కోసం నకిలీ లెటర్లు తయారుచేసి రూ.వేలకు అమ్ముకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. బైర్మల్ వీధిలో అద్దెకు నివసించే ఓ యువకుడు ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధుల పేర్లతో నకిలీ లెటర్లు తయారు చేస్తున్నట్లు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గుర్తించారు. తాజాగా ఎంపీ బైరెడ్డి శబరి పేరుతో నకిలీ లెటర్ తయారు చేసి నెల్లూరు వాసులకు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 17, 2026
HYDలో భారీ మోసం.. బాధితుల్లో ఎక్కువ వారే

శంషాబాద్ ఎయిర్పోర్టులో గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాల పేరిట సాగుతున్న మోసంపై పోలీసులు నిఘా పెట్టారు. అధికారిక లోగోలను వాడుతూ నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు సృష్టించి, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.50వేల- రూ.లక్ష వరకు వసూలు చేశారు. 6 నెలల్లోనే ఈ తరహా మోసాలపై సిటీ సైబర్ క్రైమ్ విభాగంలో 120కిపైగా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులే ఉండటం గమనార్హం.
News April 17, 2026
VIRAL: ఇన్ఫ్లుయెన్సర్ బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్

ఇన్స్టాలో జర్మనీ ఇన్ఫ్లుయెన్సర్ Lizlaz బోల్డ్ ఫొటోకు కింగ్ కోహ్లీ లైక్ కొట్టడం SMలో వైరల్గా మారింది. అయితే ఇది అనుకోకుండా జరిగిందా లేక అల్గారిథమ్ కారణంగానా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అల్గారిథమ్ వల్లేనని స్పిన్నర్ చాహల్ కామెంట్ చేయడం గమనార్హం. ఇక గతంలోనూ బాలీవుడ్ నటి అవ్నీత్ కౌర్ ఫొటోకు కోహ్లీ లైక్ కొట్టడం నెట్టింట వైరల్ కాగా అందుకు అల్గారిథమే కారణమని విరాట్ తర్వాత క్లారిటీ ఇచ్చారు.
News April 17, 2026
విజయవాడ వెస్ట్ బైపాస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి

విజయవాడ వెస్ట్ బైపాస్పై జరిగిన ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందారు. కానూరుకు చెందిన జగదీష్ HYDలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆయన, గురువారం ఉదయం తన స్నేహితుడి ఇంటి నుంచి తిరిగి HYD బయలుదేరారు. వెదురుపావులూరు టోల్గేట్ దాటిన కొద్దిసేపటికే గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టడంతో జగదీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


