News August 14, 2025
అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన వర్క్షాప్లో కలెక్టర్ కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. స్కూలింగ్ బిల్డింగ్ బ్లాక్స్ అనే అంశంపై జిల్లాలోని విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అన్ని రంగాల్లోనూ కృషి చేయాలని ఆమె సూచించారు.
Similar News
News August 14, 2025
ALERT: కాసేపట్లో వర్షం

TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 1-2 గంటల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వాన పడుతుందని అంచనా వేసింది. అలాగే రాబోయే 2 గంటల్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News August 14, 2025
మంచిర్యాల: ‘మధ్యాహ్న భోజనం అమలు చేయాలి’

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అందించాలని USFI విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఈరోజు ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తోన్న విధానంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని కోరారు.
News August 14, 2025
30న MGU డిగ్రీ 6వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష

MGU పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అవకాశాన్ని అందిపుచ్చుకొని దరఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కేవలం ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.