News August 14, 2025
HYD: అలాంటి లక్షణాలు కనిపిస్తే.. హాస్పిటల్ వెళ్లండి.!

మత్తుకు బానిసవుతున్న యువత ఆరోగ్యం క్షేనిస్తోంది. జ్ఞాపకశక్తి మందగించడం, కళ్లు ఎరుపెక్కటం, పెదాలు పొడి బారిపోవడం, ఒంటరిగా బతకటం, మానసిక ఒత్తిడిని గమనించటం, ఆకలి తగ్గిపోవడం, అంతకు ముందులా నిద్ర లేకపోవడం, నిద్రకు దూరం అవటం లాంటివి గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని HYD ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
Similar News
News April 18, 2026
ఈ బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లకు అత్యధిక FD రేట్లు!

మూడేళ్ల టెన్యూర్కుగాను సీనియర్ సిటిజన్లకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా 8% ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నాయి. ఇక ప్రైవేట్లో బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్ 7.75%, RBL 7.70% వడ్డీని అందిస్తున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా 7%తో టాప్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో 6.80%తో పంజాబ్ నేషనల్ బ్యాంక్, SBI ఉన్నాయి.
News April 18, 2026
మెగా టెస్టింగ్ మోడ్లో కాళేశ్వరం బ్యారేజీలు

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం వేగం పెంచింది. నిపుణుల పర్యవేక్షణలో మేడిగడ్డలో 504, సుందిళ్లలో 230, అన్నారంలో 281 బోర్హోల్స్ వేసి ఈనెల 30 నుంచి JULY 15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. GPR స్కానింగ్, డ్రోన్ సర్వేలు, జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలతో భూమి, నిర్మాణాల బలం అంచనా వేస్తారు. టెయిల్ వాటర్ స్టడీలు, వరద ప్రవాహ విశ్లేషణతో గేట్ల భద్రతపై NDSA కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
News April 18, 2026
భూగర్భ జలాల పెంచడమే లక్ష్యం: కలెక్టర్

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. శనివారం కోడుమూరు మండలం ఆమడగుంట్లలో నీటి భద్రత, జల ధార జల హారతి కార్యక్రమం నిర్వహించారు. వంకలను, వాగులను, చెరువులను గుర్తించి వాటికి మరమ్మత్ పనులు చేపట్టి నీరు నింపుతామన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నీటిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.


