News August 14, 2025
వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూటమిదే విజయం: మంత్రి

AP: వచ్చే ఎన్నికల్లో(అసెంబ్లీ, పార్లమెంటు) పులివెందులలో కూటమిదే విజయమని మంత్రి పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు. ‘పులివెందుల ZPTC ఎన్నికల్లో TDP విజయం 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి తొలి మెట్టు. YCPకి ఇది బలమైన నియోజకవర్గం. ఓటింగ్ను బహిష్కరించాలని ఆ పార్టీ చెప్పినా 55-65% పోలింగ్ నమోదైంది. ప్రజల్లో YCPపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనం. పోలీసులను జగన్ కించపరచడం సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News April 17, 2026
ఇంకా క్రేజీ రీల్స్ చేస్తా: అర్ష్దీప్

అర్ష్దీప్ సింగ్ IPLలో 100 వికెట్ల క్లబ్లో చేరిపోయారు. గ్రౌండ్లో నిప్పులు చెరిగే బాల్స్తో భయపెట్టే ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. బయట మాత్రం ఫుల్ జోవియల్గా ఉంటారు. తనకు ఇన్స్టా రీల్స్ చేయడం అంటే ఇష్టమని, ఫ్యాన్స్ కూడా ఆటతో పాటు రీల్స్ చూసి బాగా కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు. తన సోషల్ మీడియా క్రేజ్ వల్లే దేశమంతటా సపోర్ట్ లభిస్తోందని.. ఫ్యాన్స్ కోసం మరిన్ని క్రేజీ రీల్స్ చేస్తానని ప్రామిస్ చేశారు.
News April 17, 2026
VIRAL: ఇన్ఫ్లుయెన్సర్ బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్

ఇన్స్టాలో జర్మనీ ఇన్ఫ్లుయెన్సర్ Lizlaz బోల్డ్ ఫొటోకు కింగ్ కోహ్లీ లైక్ కొట్టడం SMలో వైరల్గా మారింది. అయితే ఇది అనుకోకుండా జరిగిందా లేక అల్గారిథమ్ కారణంగానా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అల్గారిథమ్ వల్లేనని స్పిన్నర్ చాహల్ కామెంట్ చేయడం గమనార్హం. ఇక గతంలోనూ బాలీవుడ్ నటి అవ్నీత్ కౌర్ ఫొటోకు కోహ్లీ లైక్ కొట్టడం నెట్టింట వైరల్ కాగా అందుకు అల్గారిథమే కారణమని విరాట్ తర్వాత క్లారిటీ ఇచ్చారు.
News April 17, 2026
గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని మృతి

TG: మాంసం ముక్క వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబ్నగర్(D)లో జరిగింది. మూసాపేట(M) సంకలమద్దికి చెందిన అంజి(35) నిన్న రాత్రి కందూర్ స్టేజి వద్ద హోటల్లో బిర్యానీ తింటుండగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చనిపోగా అతనితో ఉన్న స్నేహితులు భయంతో డెడ్బాడీని వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. ఇటీవల మహబూబాబాబ్(D)లోనూ ఓ వ్యక్తి ఇలాగే చనిపోయాడు.


