News August 14, 2025
ఆమనగల్లో రూ.4 కోట్ల BC హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన

NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీకృష్ణ కలిసి ఆమనగల్ మండల కేంద్రంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించబోయే BC హాస్టల్కు శంకుస్థాపన చేశారు. ఈ నిధులు అరబిందో పార్మా కంపెనీ నుంచి CSR ఫండ్ ద్వారా ఎంపీ మల్లు రవి ప్రత్యేక చొరవతో మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News August 14, 2025
తెర వెనుక పొత్తులకు బ్రాండ్ జగనే: షర్మిల

AP: మాజీ సీఎం జగన్ది నీతిమాలిన చరిత్ర అని పీసీసీ స్టేట్ చీఫ్ షర్మిల విమర్శించారు. తెర వెనుక పొత్తులకు ఆయన ఓ పెద్ద బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. ‘మోదీకి జగన్ వంగి వంగి దండాలు పెట్టారు. పార్లమెంట్లో ఆ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చారు. మోదీ, అమిత్ షాతో హాట్ లైన్ టచ్లో ఉన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే విమర్శలు చేస్తారా? మీదో పార్టీ.. మీరొక నాయకుడు’ అని ఆమె ఫైర్ అయ్యారు.
News August 14, 2025
ఆసిఫాబాద్: ‘రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి’

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అత్యవసర రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ASFలోని మాలన్ గొందికి వెళ్లే రహదారి వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు కొంతమేర తెగిపోవడంతో అధికారులతో కలిసి పరిశీలించారు. దెబ్బతిన్న రహదారికి వెంటనే మరమ్మతు పనులు చేపట్టి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
News August 14, 2025
సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగించుకోవాలి: ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్

ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కొమురం భీమ్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం కాగజ్నగర్ పట్టణంలోని సామాజిక సంక్షేమ భవనాలు, పాఠశాలలను సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో కలిసి సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలన్నారు. వ్యక్తిగత శుభ్రతను పాటించాలని విద్యార్థులకు సూచించారు.