News August 14, 2025
మొక్కల రాజశేఖర్కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం

కొత్తగూడెం: నిత్యం మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంతో మందికి ప్రకృతి హరిత దీక్ష ద్వారా మొక్కలు నాటడం అలవాటు చేసిన మొక్కల రాజశేఖర్కు అరుదైన గౌరవం దక్కింది. గతంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసించగా.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ నుంచి ఆయనకు తేనేటి విందుకు ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
Similar News
News April 19, 2026
అనంత: పెరుగుతున్న చీనీ ధరలు.. రైతుల హర్షం

అనంతపురం మార్కెట్ యార్డులో చీనీకాయల ధరలు కొన్ని రోజులుగా పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో శుక్రవారం 1,135 టన్నుల చీనీకాయలను టన్ను గరిష్ఠ ధర రూ.28 వేలకు రైతులు విక్రయించారు. మధ్యస్థం రూ.18 వేలు, కనిష్ఠం రూ.10 వేలు చొప్పున అమ్మారు. శనివారం రూ.29 వేలకు విక్రయాలు జరిగాయని యార్డు ఎంపికశ్రేణి ఇన్ఛార్జ్ కార్యదర్శి, ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు.
News April 19, 2026
అనకాపల్లి: చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు

సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారిణి(ఆర్టీసీ) వి. ప్రవీణ తెలిపారు. డిపో నుంచి ఈనెల 20న తెల్లవారుజామున మూడు గంటల నుంచి 15 బస్సులు నడుపుతామన్నారు. ఈ బస్సులు రాత్రి వరకు తిరుగుతాయన్నారు.
News April 19, 2026
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.


