News August 14, 2025
సినిమాకి వెళ్తానన్న భర్త.. గొడవపడి ఉరేసుకున్న భార్య

రుద్రవరం మం. చందలూరులో ప్రసన్న (28) అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. భర్త ఆంజనేయులు సినిమాకి వెళ్తాననడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రసన్న క్షణికావేశంలో ఉరేసుకుంది. గమనించిన భర్త ఆమెను కిందకు దించేలోపే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ బాలన్న తెలిపారు.
Similar News
News August 15, 2025
TODAY HEADLINES

* పులివెందుల, ఒంటిమిట్ట ZPTCలు TDP కైవసం
* ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: CBN
* దొంగ ఓట్లతో గెలవడమూ ఓ గెలుపేనా: అవినాశ్
* CS పదవీకాలం పొడిగింపు కోసం CM రేవంత్ రిక్వెస్ట్!
* SC తీర్పు ప్రజాస్వామ్య విజయం: మహేశ్ కుమార్
* 3 దశాబ్దాల తర్వాత నచ్చిన వారికి ఓటేశారు: పవన్
* ‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలిచిపోతుంది: రాష్ట్రపతి
* ఈ నెల 18న శ్రీవారి ఆర్జిత టికెట్ల కోటా రిలీజ్
News August 15, 2025
గోదావరి నదిని పరిశీలించిన కలెక్టర్

ఇబ్రహీంపట్నం మం. ఎర్దండి గ్రామ శివారులోని గోదావరి నదిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. గతేడాది గోదావరి నది వరదతో ఉప్పొంగినప్పుడు తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భారీవర్షాల నేపథ్యంలో నదిలో వరద ఉప్పొంగితే తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి RDO శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 15, 2025
మంత్రి పొంగులేటితో ఇన్ఛార్జి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

భారీ వర్షాలు సహాయక చర్యల నిర్వహణపై మంత్రి పొంగులేటి గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ (రెవెన్యూ) తో పాటు టొప్పో పాల్గొన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి టొప్పో వివరించారు.