News August 14, 2025

30న MGU డిగ్రీ 6వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష

image

MGU పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్‌లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అవకాశాన్ని అందిపుచ్చుకొని దరఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కేవలం ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News April 16, 2026

44.1 డిగ్రీలతో సెగలు గక్కుతున్న నల్గొండ

image

నల్గొండ జిల్లాలో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. భానుడి భగభగలకు జిల్లా నిప్పుల కొలిమిలా మారగా, గుడిపల్లిలో అత్యధికంగా 44.1°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకొండ, కట్టంగూరు వంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

News April 16, 2026

NLG: రైతు భరోసాపై వీడని సందిగ్ధం

image

రైతు భరోసా రెండో విడత నిధుల జమపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 13 నుంచే నిధులు వేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్‌లో మొదటి విడతగా ఎకరంన్నర లోపు భూమి ఉన్న రైతులకు రూ.268.57 కోట్లు జమ చేశారు. ఎకరాకు ఏడాదికి రూ.12 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, నిధుల విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News April 16, 2026

కృష్ణ బోర్డు వ్యవహార శైలిపై లేఖ

image

కృష్ణా బోర్డు వ్యవహారశైలిపై ఇరిగేషన్ శాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జల వివాదాల పరిష్కారం బోర్డు బాధ్యతైనా, ఇటీవల రెండు రాష్ట్రాలు సమస్యలు తామే తేల్చుకోవాలని లేఖ రాయడం వివాదాస్పదమైంది. ఏపీకి అనుకూలంగా బోర్డు వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తుండగా, త్రీ మెంబర్ కమిటీ సమావేశాలు సకాలంలో జరపడం లేదని, టీజీ ప్రభుత్వమే నిధులు ఇస్తున్నా సరైన చర్యలు అధికారులు బుధవారం ప్రభుత్వానికి లేఖ రాశారు.