News August 14, 2025
మంచిర్యాల: సెప్టెంబర్లో రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షలు

సెప్టెంబర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంచిర్యాల డీఈఓ యాదయ్యకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పరిషత్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కొట్టే నటేశ్వర్, బీజేపీ నాయకుడు కిషోర్ మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో విజేతలకు ప్రథమ రూ.లక్ష, ద్వితీయ రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News August 15, 2025
అవకాడో విత్తనంపై ‘భరతమాత’!

ఆళ్లగడ్డకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు విజయ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా వినూత్న ఆలోచనతో ‘అవకాడో’ విత్తనంపై భరతమాత సూక్ష్మచిత్రాన్ని పలు రంగులతో చిత్రించారు. సన్నని విత్తనంపై అద్భుతమైన ఆకృతులు, సున్నితమైన రంగుల సమ్మేళనంతో తీర్చిదిద్దిన ఈ కళాఖండం చూసిన వారిని మంత్రముగ్ధులను చేస్తోంది. వైవిధ్యభరితమైన చిత్రాలతో ఇప్పటికే ప్రజల ప్రశంసలు పొందిన విజయ్, ఈ సృజనతో తన ప్రతిభను మరొకసారి చాటుకున్నారు.
News August 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 15, 2025
ఇండియాపై టారిఫ్స్ వల్లే పుతిన్ కలుస్తున్నారు: ట్రంప్

రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను కలవడం వెనుక భారత్పై వేసిన అదనపు టారిఫ్స్ కూడా ఓ కారణమని US అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ‘ప్రతి నిర్ణయానికి ఓ ప్రభావం ఉంటుంది. ఇండియాపై రెండోసారి విధించిన సుంకాలు వారిని రష్యా నుంచి ఆయిల్ కొనకుండా ఆపేశాయి. మీ రెండో అతిపెద్ద కస్టమర్ని కోల్పోయినప్పుడు, మొదటి అతిపెద్ద కస్టమర్ని కోల్పోబోతున్నప్పుడు బహుశా ఆ ప్రభావం ఉందని భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.