News August 14, 2025

వరంగల్: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

భారీ వర్షాల ప్రభావంతో పోతన రోడ్‌లోని మరాఠీ భవన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ డా.సత్య శారద సందర్శించారు. ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, బృందావన్ కాలనీ నిర్వాసితుల కోసం అందిస్తున్న తాగునీరు, ఆహారం, వైద్యసదుపాయాలు, వసతులను పరిశీలించారు. భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున పలు సూచనలు చేశారు.

Similar News

News August 14, 2025

నియంత్రణలో సీజనల్ వ్యాధులు: డీఎంఅండ్‌హెచ్‌ఓ

image

జిల్లాలో సీజనల్ వ్యాధులు నియంత్రణలో ఉన్నాయని డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు మలేరియా 7, డెంగ్యూ 54 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రి ప్రజలకు ప్రాణదాతగా నిలుస్తోందని ప్రత్యేక అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు.

News August 14, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ కలెక్టర్

image

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. HYDలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారుల సమీక్షలో పలు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలకు 24/7 కంట్రోల్ రూమ్ నంబర్లు 1800 425 3424, 9154 252936 అందుబాటులో ఉన్నాయన్నారు.

News August 14, 2025

వరంగల్: క్వింటా పసుపు ధర రూ. 12,003

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ)కి రూ. 2,380 ధర వచ్చింది. అలాగే సూక పల్లికాయకు రూ.6,200, పచ్చి పల్లికాయకు రూ.4,900 పలికింది. పసుపు రూ.12,003 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. వర్షంలో సైతం కొనుగోళ్లు చురుగ్గా సాగాయి.