News August 14, 2025
TU: మొదటి రోజు పరీక్షలకు 127 మంది గైర్హాజరు

టీయూ పరిధిలో పీజీ 2, 4 సెమిస్టర్ రెగ్యులర్, బీఈడీ 2, 4 సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. పీజీ, బీఈడీ కలిపి 12 పరీక్ష కేంద్రాలలో మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ అడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పీజీ పరీక్షలకు 1861 మందికి గాను 1784 మంది హాజరు కాగా 77 మంది గైర్హాజరయ్యారు. బీఈడీ పరీక్షలకు 1544 మందికి గాను 1494 మంది హాజరు కాగా 50 మంది గైర్హాజరయ్యారు.
Similar News
News April 17, 2026
లక్షెట్టిపేట: జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్యులు అవగాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు విభాగాలను ఆయన పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ దిలీప్ పాల్గొన్నారు.
News April 17, 2026
HYD: Instaలో కూతురి ఫేక్ అకౌంట్.. తండ్రికి అశ్లీల వీడియోలు!

మేడిపల్లి PS పరిధిలో సైబర్ కిరాతకుల వికృత చేష్టలు వెలుగుచూశాయి. కాచవానిసింగారం దివ్యానగర్కు చెందిన వ్యక్తి(50) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించారు. అతనికి అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు దిగారు. అంతటితో ఆగకుండా వాటిని బంధుమిత్రులకు పంపించి మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 17, 2026
HYD: Instaలో కూతురి ఫేక్ అకౌంట్.. తండ్రికి అశ్లీల వీడియోలు!

మేడిపల్లి PS పరిధిలో సైబర్ కిరాతకుల వికృత చేష్టలు వెలుగుచూశాయి. కాచవానిసింగారం దివ్యానగర్కు చెందిన వ్యక్తి(50) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించారు. అతనికి అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు దిగారు. అంతటితో ఆగకుండా వాటిని బంధుమిత్రులకు పంపించి మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


