News August 14, 2025
ఎడ్ల బండిని ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి

బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లెకు చెందిన దేవరకొండ నరసయ్య యాదవ్ (42) స్కూటర్పై వెళ్తూ ఎడ్ల బండిని ఢీకొట్టాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అదే గ్రామానికి చెందిన సోమిరెడ్డి పల్లె నరసయ్య ఎడ్ల బండిపై పొలం వెళ్తుండగా నరసయ్య యాదవ్ స్కూటర్పై వేగంగా వెళ్తూ బండిని ఢీ కొట్టాడు. చికిత్స నిమిత్తం పొద్దుటూరుకి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.
Similar News
News August 15, 2025
కడపలో జెండా ఎగురవేసిన మంత్రి ఫరూక్

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు కడప నగరంలో నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి మంత్రి ఫరూక్ హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై తన సందేశంలో ప్రజలకు వినిపించారు.
News August 15, 2025
కడపలో జెండా ఎగురవేసిన మంత్రి ఫరూక్

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు కడప నగరంలో నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి మంత్రి ఫరూక్ హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై తన సందేశంలో ప్రజలకు వినిపించారు.
News August 15, 2025
జెండా ఎగురవేసిన కడప కలెక్టర్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శ్రీధర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం జాతీయ జెండా ఎగురవేసి అధికారులకు సిబ్బందికి ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితంతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు.