News August 14, 2025
GWL: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

గద్వాల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రేపు జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకావాలని కలెక్టర్ సంతోష్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి హాజరై ఉదయం 9:30 గంటలకు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు.
Similar News
News August 15, 2025
ఖమ్మం: పాఠశాలల్లో ప్రతి నెల 4వ శనివారం బ్యాగ్లెస్ డే..!

ఖమ్మం కలెక్టరేట్లో గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీజ సమక్షంలో విద్యాశాఖ అధికారులతో యూడీఐఎస్ఈ నమోదు, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, అపార్ రిజిస్ట్రేషన్, మధ్యాహ్న భోజనం, పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలపై సమీక్షించారు. ఇకపై ప్రతి నెల 4వ శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాగ్లెస్ డేగా నిర్వహించి, క్రీడలు, పాటలు, వంటి కార్యక్రమాలు ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఆదేశించారు
News August 15, 2025
కామారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కల్లూరి మహేష్కు కామారెడ్డి జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.70 వేల జరిమానా విధించింది. బాన్సువాడలో 2021లో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా జడ్జి వర ప్రసాద్, సాక్ష్యాలు, వైద్య నివేదికల ఆధారంగా నిందితుడు మహేష్ను దోషిగా నిర్ధారించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
News August 15, 2025
వియత్నాం స్టీల్పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీ

వియత్నాం నుంచి ఎగుమతి అయ్యే కొన్ని స్టీల్ షిప్మెంట్స్పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల భారత ఉక్కు రంగానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనే విషయంపై ఏడాది పాటు దర్యాప్తు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అలోయ్/నాన్-అలోయ్ స్టీల్తో చేసిన ఉత్పత్తులపై ఈ సుంకం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తరహా టారిఫ్స్ విధించకపోతే దేశీయ ఉక్కు రంగానికి ప్రమాదమని పేర్కొంది.