News August 14, 2025

ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్‌కి చెంపపెట్టు: దేవినేని ఉమా

image

ప్రజాస్వామ్య పద్ధతిలో పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డికి చెంపపెట్టు అని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గొల్లపూడిలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవంకు ఒకరోజు ముందు పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. జగన్ రెడ్డి చేసిన పాపాలే అతనికి శాపాలు అయ్యాయన్నారు. వై నాట్ కుప్పం అన్న జగన్ నేడు పులివెందుల ప్రజల తీర్పు పై ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు.

Similar News

News August 15, 2025

ఖమ్మం: పాఠశాలల్లో ప్రతి నెల 4వ శనివారం బ్యాగ్‌లెస్ డే..!

image

ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీజ సమక్షంలో విద్యాశాఖ అధికారులతో యూడీఐఎస్ఈ నమోదు, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, అపార్ రిజిస్ట్రేషన్, మధ్యాహ్న భోజనం, పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలపై సమీక్షించారు. ఇకపై ప్రతి నెల 4వ శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాగ్‌లెస్ డేగా నిర్వహించి, క్రీడలు, పాటలు, వంటి కార్యక్రమాలు ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఆదేశించారు

News August 15, 2025

కామారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కల్లూరి మహేష్‌కు కామారెడ్డి జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.70 వేల జరిమానా విధించింది. బాన్సువాడలో 2021లో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా జడ్జి వర ప్రసాద్, సాక్ష్యాలు, వైద్య నివేదికల ఆధారంగా నిందితుడు మహేష్‌ను దోషిగా నిర్ధారించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

News August 15, 2025

వియత్నాం స్టీల్‌పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీ

image

వియత్నాం నుంచి ఎగుమతి అయ్యే కొన్ని స్టీల్ షిప్మెంట్స్‌పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల భారత ఉక్కు రంగానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనే విషయంపై ఏడాది పాటు దర్యాప్తు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అలోయ్/నాన్-అలోయ్ స్టీల్‌తో చేసిన ఉత్పత్తులపై ఈ సుంకం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తరహా టారిఫ్స్ విధించకపోతే దేశీయ ఉక్కు రంగానికి ప్రమాదమని పేర్కొంది.