News April 1, 2024
పొంగులేటికి ఖమ్మం, తుమ్మలకు మహబూబాబాద్

పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలనుకుంటున్న అధికార కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోకసభ స్థానాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జీగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జీగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరించనున్నారని ఏఐసీసీ కార్యాలయం నుంచి ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు.
Similar News
News March 20, 2026
మండిపోతున్న ఎండలు.. చుక్కల్లో నిమ్మ ధర!

జిల్లాలో భానుడి భగభగలకు తోడు నిమ్మ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎండాకాలం ప్రారంభం కావడంతో నిమ్మకాయలకు గిరాకీ పెరిగి, ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. గతంలో డజను రూ. 20-30 పలికిన ధర.. ప్రస్తుతం ఏకంగా రూ. 80-100కు చేరింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో కాయ రూ. 7 నుంచి రూ. 10 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలతో వినియోగదారులు, హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు.
News March 20, 2026
పర్యాటకానికి ‘బడ్జెట్’ ఊతం ఇచ్చేనా?

రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యాటక రంగానికి మహర్దశ పడుతుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక కారిడార్ అభివృద్ధికి, భద్రాద్రి, జమలాపురం వంటి పుణ్యక్షేత్రాల ఆధునీకరణకు సుమారు రూ. 500 కోట్లు అవసరమని అంచనా. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా ఇప్పుడే నిధులు కేటాయిస్తేనే ఘాట్లు, రహదారుల పనులు సకాలంలో పూర్తవుతాయి.
News March 19, 2026
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఖరారు

ఖమ్మం DCC నూతన కార్యవర్గాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కసరత్తు చేసిన పీసీసీ.. జిల్లాలోని కీలక నేతలందరికీ ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యమైన కమిటీని వెల్లడించింది. ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, 22 మంది ప్రధాన కార్యదర్శులు, 26 మంది కార్యదర్శులకు చోటు కల్పించారు. వీరితో పాటు 5 మంది అధికార ప్రతినిధులు, 15 మంది కార్యనిర్వాహక సభ్యులను నియమించారు.


