News August 14, 2025
కొమురం భీమ్ జిల్లా వాసికి జాతీయ ఉత్తమ అవార్డు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 సంవత్సరానికి జాతీయ స్వతంత్ర జ్యురి బుధవారం నిర్వహించిన ముఖాముఖిలో తెలంగాణ నుంచి 150మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఆరుగురిని ఎంపిక చేశారు. అందులో కొమురం భీమ్ జిల్లా కేంద్రంలోని జన్కపూర్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ధర్మపురి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ శాలువా, జ్ఞాపికతో ఆయనను సన్మానించారు.
Similar News
News April 19, 2026
‘ప్రాజెక్ట్ పునర్విక’.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

AP: అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లలకు వైద్య సాయం అందించేందుకు మంత్రి లోకేశ్ ‘ప్రాజెక్ట్ పునర్విక’ను ప్రకటించారు. చిన్నారి <<19682330>>పునర్వికకు<<>> ₹16Cr ఇంజెక్షన్ ఇస్తుండగా చూడటం తన జీవితంలోని భావోద్వేగ క్షణాల్లో ఒకటని Xలో <
News April 19, 2026
GWL: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి నుంచి బటన్ నొక్కి రైతు భరోసా రెండో విడత నిధులు రేపు విడుదల చేస్తారని గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప ఆదివారం ప్రకటనలో తెలిపారు. రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రైతులందరూ వారి సమీపంలోని రైతు వేదికల వద్దకు చేరుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
News April 19, 2026
ఆహారాన్ని వేగంగా తింటున్నారా?

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందికి తినడానికి టైమ్ దొరకట్లేదు. వేగంగా తినడం వల్ల కడుపు నిండిందనే సిగ్నల్ బ్రెయిన్కు వెళ్లడం ఆలస్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎక్కువగా తినేస్తే బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ‘ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల జీర్ణసమస్యలు వస్తాయి. ఇలాగే ఎక్కువ రోజులు కొనసాగితే కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి’ అని పేర్కొంటున్నారు.


