News August 15, 2025

గోదావరి నదిని పరిశీలించిన కలెక్టర్

image

ఇబ్రహీంపట్నం మం. ఎర్దండి గ్రామ శివారులోని గోదావరి నదిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. గతేడాది గోదావరి నది వరదతో ఉప్పొంగినప్పుడు తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భారీవర్షాల నేపథ్యంలో నదిలో వరద ఉప్పొంగితే తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి RDO శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News August 15, 2025

మెదక్: ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు సస్పెండ్

image

మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్రావు నగర్ కాలనీలో బుధవారం పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో బాగంగా పట్టుబడ్డ కానిస్టేబుల్స్ అంజనేయులు, సురేశ్‌పై శాఖపరమైన చర్యలో భాగంగా సస్పెండ్ చేస్తు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసులు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News August 15, 2025

‘గుంటూరు కేసరి’ నడింపల్లి లక్ష్మీనరసింహారావు పంతులు

image

స్వాతంత్రోద్యమ కాలంలో ‘గుంటూరు కేసరి’గా నడింపల్లి లక్ష్మీనరసింహారావు పంతులు (1890-1978) పిలవబడ్డారు. టంగుటూరి ప్రకాశం వద్ద శిష్యుడిగా పనిచేసి, కోస్తాంధ్ర ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వ్యక్తి. స్వాతంత్రానికి ముందు 11 సంవత్సరాలు గుంటూరు పురపాలక ఛైర్మన్‌గా, 1953లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా చేశారు. గాంధీ పార్క్ నిర్మాణం ఈయన హయాంలోనే జరిగింది. హిమని కూడలి వద్ద ఈయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

News August 15, 2025

కుక్కలకు మెరుగైన జీవితం ఇవ్వండి: కపిల్ దేవ్

image

వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలన్న SC తీర్పుపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ‘కుక్కల గురించి చాలా వార్తలు వింటున్నాం. అవి చాలా అద్భుతమైన జీవులు. వాటికి అధికారులు మెరుగైన జీవితాన్ని అందించాలి. ఊరికే అలా వాటిని ఎక్కడో పడేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. వీధికుక్కలపై జరుగుతున్న చర్చలు, వివాదాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.