News August 15, 2025
జిల్లాలోని క్రీడాకారులకు గుడ్ న్యూస్

జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని క్రీడా పురస్కారాలను అందించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాలోని 5 పాఠశాలలను ఎంపిక చేస్తామన్నారు. 2025 విద్యా సంవత్సరంలో స్కూల్ గేమ్స్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు 18లోగా ధ్రువీకరణ పత్రాలను ఎస్సీఎఫ్ కార్యాలయంలో అందజేయాలన్నారు.
Similar News
News August 14, 2025
ప్రకాశం జిల్లాలో 25 బార్ల ఏర్పాటు..!

ప్రకాశం జిల్లాలో నూతన బార్ పాలసీ అమలుపై ఎక్సైజ్ శాఖ అధికారులు సమీక్షించారు. జిల్లా జనాభా ప్రాతిపదికన 25 బార్లు నిర్వహించడానికి ప్రతిపాదన చేశారు. 50వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ.35 లక్షలు, ఆపైన 5లక్షల లోపు జనాభా ఉన్న ఏరియాల్లో రూ.55 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. ఈ బార్లకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరించనున్నారు.
News August 14, 2025
ఒంగోలు సమీపంలో ఒకరి మృతి

ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలోని దిగువ లైన్ వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ మధుసూదన్ రావు మృతదేహాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని గుర్తించిన వారు నేరుగా తమను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
News August 14, 2025
దోర్నాలలో చిన్నారిపై చిరుత పులి దాడి

దోర్నాల మండలం చిన్నారుట్ల గిరిజన గూడెంలో ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిపై చిరుత పులి దాడి చేసింది. తల్లిదండ్రులు అప్రమత్తమై కేకలు వేయడంతో పాపను విడిచి వెళ్లిపోయింది. అర్ధరాత్రి సమయంలో చిరుత పులి పాపపై దాడి చేయడంతో తల, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారిని తల్లిదండ్రులు సున్నిపెంట వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.