News August 15, 2025
ప్రజాస్వామ్యం గెలిచింది: అచ్చెన్నాయుడు

AP: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తుతో వైసీపీ దొంగ ఓట్లు, జిమ్మిక్కులు పనిచేయలేదు. ప్రజలు కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇది ప్రజా విజయం. 2024లో ప్రజలు వారిని 11 స్థానాలకే పరిమితం చేసినా.. జగన్లో ఇంకా మార్పు రాలేదు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News August 15, 2025
EP36: శత్రువులను ఎలా గెలవాలంటే: చాణక్య నీతి

ప్రతి వ్యక్తికి మిత్రులే కాదు.. శత్రువులు కూడా ఉంటారు. అలాంటి విరోధిని ఎలా గెలవాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘మీ శత్రువు ముందు మీరు ఆనందంగా ఉండండి. మీ విజయాలను వారికి తెలిసేలా చేయండి. మీ సంతోషం, మీ ఎదుగుదలే ఆ శత్రువులను అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఇంతకన్నా మీరు వారిపై మరే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని చెబుతోంది.
<<-se>>#Chankyaneeti<<>>
News August 15, 2025
అమెరికా బెదిరింపులు.. వెనక్కి తగ్గని భారత్

USటారిఫ్స్ నేపథ్యంలో రష్యన్ ఆయిల్ తక్కువ/ఎక్కువ కొనాలని ఎవరూ చెప్పలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) పేర్కొంది. ‘యథావిధిగా వ్యాపారం చేస్తున్నాం. ఆయిల్ దిగుమతులపై నిలుపదల లేదు. రష్యా ముడి చమురుపై ఎలాంటి ఆంక్షలు లేవు. అమెరికా/ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎక్కువ కొనండి లేదా తగ్గించండి అని కూడా ఎవరూ చెప్పలేదు’ అని IOC ఛైర్మన్ AS సాహ్ని వెల్లడించారు. రష్యా ఆయిల్పై భారత్ వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.
News August 15, 2025
కుక్కలకు మెరుగైన జీవితం ఇవ్వండి: కపిల్ దేవ్

వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలన్న SC తీర్పుపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ‘కుక్కల గురించి చాలా వార్తలు వింటున్నాం. అవి చాలా అద్భుతమైన జీవులు. వాటికి అధికారులు మెరుగైన జీవితాన్ని అందించాలి. ఊరికే అలా వాటిని ఎక్కడో పడేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. వీధికుక్కలపై జరుగుతున్న చర్చలు, వివాదాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.