News April 1, 2024
HYD: రేవంత్ పాలన చూసి ప్రజలు సంతోషిస్తున్నారు: మంత్రి

100 రోజుల రేవంత్ రెడ్డి పాలనను చూసి ప్రజలు సంతోషిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో HYD ఎల్బీనగర్ పరిధి కర్మన్ఘాట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ను అసెంబ్లీ ఎన్నికలో ఆదరించారని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపించాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు CM రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. BRSను నమ్మొద్దన్నారు.
Similar News
News September 9, 2025
HYD: లా సెట్ 2వ దశ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు

లా కోర్సుల్లో ప్రవేశాలకు రెండో దశ ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 14న వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 15 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 17న ఎడిట్ చేసుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపు జాబితాను 22న విడుదల చేస్తామని పేర్కొన్నారు.
News September 9, 2025
బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. పరీక్షా ఫలితాల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News September 9, 2025
పన్ను వసూళ్లకు GHMCకు కొత్త టెక్నిక్!

GHMC తన ఆస్తి పన్ను ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. TGSPDCL సహకారంతో ఆస్తి పన్ను ఐడీ నంబర్లను (PTIN) విద్యుత్ కనెక్షన్లతో (USC) అనుసంధానం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 6 GHMCలోని జోన్లలో గణనీయమైన పురోగతి సాధించింది. 96,938 నివాస ఆస్తుల పన్ను ఐడీలు విజయవంతంగా వాణిజ్య విద్యుత్ కనెక్షన్లతో అనుసంధానం అయ్యాయని అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు.