News August 15, 2025
వియత్నాం స్టీల్పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీ

వియత్నాం నుంచి ఎగుమతి అయ్యే కొన్ని స్టీల్ షిప్మెంట్స్పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల భారత ఉక్కు రంగానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనే విషయంపై ఏడాది పాటు దర్యాప్తు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అలోయ్/నాన్-అలోయ్ స్టీల్తో చేసిన ఉత్పత్తులపై ఈ సుంకం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తరహా టారిఫ్స్ విధించకపోతే దేశీయ ఉక్కు రంగానికి ప్రమాదమని పేర్కొంది.
Similar News
News August 15, 2025
పేదలకు 300 ఎకరాలు ఇచ్చిన మహానీయుడు

స్వాతంత్య్ర పోరాటంలో బాపట్లకు చెందిన రావూరి శ్రీశైలపతికి ప్రత్యేక స్థానం ఉంది. 1886 జనవరి 14న ఆయన జన్మించారు. మురుకుండపాడు కరణంగా పని చేస్తూ, గాంధీ పిలుపుతో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిషు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో 1922లో పదవికి రాజీనామా చేశారు. పర్చూరు మండలం చెరుకూరులో తనకు చెందిన 300 ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారు. యావదాస్తిని స్వాతంత్య్ర పోరాటానికి కేటాయించారు.
News August 15, 2025
ఈనెల 17 నుంచి బిహార్లో రాహుల్ యాత్ర

బిహార్లో ‘ఓట్ చోరీ’ అంటూ ECపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. పారదర్శక ఓటర్ల జాబితానే లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈనెల 17న ప్రారంభంకానున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1న బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో జరిగే మహాసభతో ముగియనుంది. ‘ఓట్ చోరీ’ ఉద్యమాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ మరిన్ని ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
News August 15, 2025
ఇవాళ్టి నుంచే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం

AP: రాష్ట్రంలో నేటి నుంచి మహిళలకు RTCబస్సుల్లో ఉచిత ప్రయాణం అమలులోకి రానుంది. సా.4గం.కు గుంటూరు(D) తాడేపల్లి మం. ఉండవల్లి గుహల వద్ద CM చంద్రబాబు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మహిళలతో కలిసి సీఎం, Dy.CM పవన్ బస్సులో ప్రయాణిస్తారు. 5రకాల RTC బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఫ్రీగా ప్రయాణించొచ్చు. బస్సు ఎక్కగానే గుర్తింపుకార్డు చూపించి ‘జీరో ఫేర్ టికెట్’ తీసుకోవాలి.