News August 15, 2025
ఇవాళ్టి నుంచే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం

AP: రాష్ట్రంలో నేటి నుంచి మహిళలకు RTCబస్సుల్లో ఉచిత ప్రయాణం అమలులోకి రానుంది. సా.4గం.కు గుంటూరు(D) తాడేపల్లి మం. ఉండవల్లి గుహల వద్ద CM చంద్రబాబు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మహిళలతో కలిసి సీఎం, Dy.CM పవన్ బస్సులో ప్రయాణిస్తారు. 5రకాల RTC బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఫ్రీగా ప్రయాణించొచ్చు. బస్సు ఎక్కగానే గుర్తింపుకార్డు చూపించి ‘జీరో ఫేర్ టికెట్’ తీసుకోవాలి.
Similar News
News August 15, 2025
వరదను భరించాలి కానీ ఆ నీరు వాడుకోవద్దా: చంద్రబాబు

AP: విజయవాడలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్ల ప్రాజెక్టుపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు. ఎవరూ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తున్నాం. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నాం. అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఏంటి? వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా?’ అని ప్రశ్నించారు.
News August 15, 2025
సుప్రీం తీర్పు.. రీకౌంటింగ్తో మారిన ఫలితం

హరియాణాలోని పానిపట్(D) బానాలాఖూలో 3 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల ఫలితం మారింది. 2022 NOVలో వచ్చిన ఫలితాల్లో కుల్దీప్ గెలవగా కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని మోహిత్ కోర్టుల్లో పోరాడారు. ఒక్క బూత్లో లెక్కించేందుకే జిల్లా కోర్టు అనుమతించగా దాన్ని SCలో సవాల్ చేశారు. దీంతో అన్ని బూత్లలో రీకౌంట్కు ఆదేశాలొచ్చాయి. రీకౌంటింగ్లో మోహిత్ 1,051, కుల్దీప్ 1000 ఓట్లు సాధించడంతో పిటిషనర్ సర్పంచ్గా ఎన్నికయ్యారు.
News August 15, 2025
ఆగస్టు 15.. ఈ దేశాలకూ ప్రత్యేకమే

భారతీయులకు ఆగస్టు 15 ఎంతో ప్రత్యేకం. మనతో పాటు మరో 5 దేశాలూ ఇవాళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. 1945లో జపాన్ నుంచి విముక్తి పొందిన సందర్భంగా నార్త్, సౌత్ కొరియా దేశాలు ఇవాళ లిబరేషన్ డే జరుపుకుంటాయి. అలాగే 1971లో బ్రిటిష్ నుంచి బహ్రెయిన్, 1960లో ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 1940లో జర్మన్ కాన్ఫెడరేషన్ నుంచి లిక్టన్స్టైన్ స్వాతంత్ర్యం పొందాయి.