News August 15, 2025

స్వాతంత్ర్య దినోత్సవానికి విశాఖ సిద్ధం

image

విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో 7 శకటాలు, 8 స్టాళ్లు, 52 మందితో కూడిన పోలీసుల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వివిధ పథకాల లబ్ధిదారులకు మంత్రి రూ.214.99 కోట్ల ప్రోత్సాహకాలను పంపిణీ చేయనున్నారు.

Similar News

News August 15, 2025

ఉత్తమ అవార్డు అందుకున్న DMHO పేడాడ జగదీశ్వర్రావు

image

విశాఖ జిల్లా DMHO పేడాడ జగదీశ్వర్రావు ఉత్తమ అవార్డును రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ అందించిన అవార్డుల్లో DMHO పేడాడ జగదీశ్వర్రావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది DMHOకు అభినందనలు తెలిపారు.

News August 15, 2025

విశాఖ కలెక్టరేట్లో జెండా ఎగరవేసిన కలెక్టర్

image

విశాఖ క‌లెక్ట‌రేట్లో శుక్ర‌వారం 79వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడులు ఘ‌నంగా జరిగాయి. క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయ‌న‌తో పాటు వీఎంఆర్డీఏ క‌మిష‌న‌ర్ కె.ఎస్. విశ్వ‌నాథ‌న్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ జాతీయ ప‌తాకానికి గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించారు. అనంత‌రం సందేశాన్ని అందించారు. వేడుక‌ల్లో భాగంగా సిబ్బందికి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.

News August 15, 2025

73 లక్షల మందికి సేవలు: పృథ్వీతేజ్

image

విశాఖ ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఛైర్మన్ పృథ్వితేజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ పరిధిలో 73 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని తెలిపారు. 19,385 మంది వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు అమర్చామన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 97 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.