News August 15, 2025

విజయవాడలో సీఎం పర్యటన.. పకడ్బందీ ఏర్పాట్లు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించేందుకు నేడు విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. CP రాజశేఖర్ బాబు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, భద్రతకు సంబంధించిన పలు ఆదేశాలు జారీ చేశారు. CM పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

Similar News

News August 15, 2025

CM గ్రీన్ సిగ్నల్.. వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ!

image

7 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది. 20నెలలుగా పోస్టుల భర్తీ కాకపోవడంతో నిరుత్సాహంలో ఉన్న క్యాడర్లో CM గ్రీన్ సిగ్నల్‌తో ఆశలు చిగురించాయి. ఉమ్మడి KNRలో 7 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. ఇటీవల నియోజకవర్గానికి 2 పేర్ల చొప్పున KNR CONG ఇన్ఛార్జ్ అద్దంకి దయాకర్ అధిష్ఠానానికి నివేదించారు. అయితే KNR నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకపోవడంతో పేర్లు పంపారా? లేదా? అనే అయోమయం నెలకొంది.

News August 15, 2025

విశాఖ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

విశాఖలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్న సత్యరాజ్ బైక్ పై మిత్రుడితో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వేములవలస వద్ద అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సాయికుమార్ రోడ్డు దాటుతుండగా మినీ బస్సు ఢీకొని మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 15, 2025

వరదను భరించాలి కానీ ఆ నీరు వాడుకోవద్దా: చంద్రబాబు

image

AP: విజయవాడలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్ల ప్రాజెక్టుపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు. ఎవరూ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తున్నాం. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నాం. అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఏంటి? వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా?’ అని ప్రశ్నించారు.