News August 15, 2025
భూగర్భ జలాల పెంపునకు సమష్టి కృషి అవసరం: కలెక్టర్

విజయవాడ: జలవనరుల సమర్థ నిర్వహణలో సాగునీటి వినియోగదారుల సంఘాల సహకారం కీలకమని, భూగర్భ జలాల పెంపులోనూ సమష్టి భాగస్వామ్యం ముఖ్యమని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. గురువారం సీఎం చంద్రబాబు వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సాగునీటి వినియోగదారుల సంఘాల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News August 15, 2025
CM గ్రీన్ సిగ్నల్.. వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ!

7 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది. 20నెలలుగా పోస్టుల భర్తీ కాకపోవడంతో నిరుత్సాహంలో ఉన్న క్యాడర్లో CM గ్రీన్ సిగ్నల్తో ఆశలు చిగురించాయి. ఉమ్మడి KNRలో 7 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. ఇటీవల నియోజకవర్గానికి 2 పేర్ల చొప్పున KNR CONG ఇన్ఛార్జ్ అద్దంకి దయాకర్ అధిష్ఠానానికి నివేదించారు. అయితే KNR నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకపోవడంతో పేర్లు పంపారా? లేదా? అనే అయోమయం నెలకొంది.
News August 15, 2025
విశాఖ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

విశాఖలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్న సత్యరాజ్ బైక్ పై మిత్రుడితో కలిసి ఫంక్షన్కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా డివైడర్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వేములవలస వద్ద అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సాయికుమార్ రోడ్డు దాటుతుండగా మినీ బస్సు ఢీకొని మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News August 15, 2025
వరదను భరించాలి కానీ ఆ నీరు వాడుకోవద్దా: చంద్రబాబు

AP: విజయవాడలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్ల ప్రాజెక్టుపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు. ఎవరూ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తున్నాం. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నాం. అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఏంటి? వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా?’ అని ప్రశ్నించారు.