News August 15, 2025
నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు.. సీఎం అభినందనలు

AP: సీఎం చంద్రబాబు స్వగ్రామం తిరుపతి(D) నారావారిపల్లెకు పీఎం సూర్యఘర్ పథకం కింద స్కోచ్ అవార్డు లభించింది. పైలట్ ప్రాజెక్టుగా ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం, నారావారిపల్లెలో తక్కువ టైంలో సోలార్ రూఫ్టాప్ పనులను పూర్తి చేశారు. దీంతో ‘స్వర్ణ నారావారిపల్లె’ కింద కేంద్రం గుర్తించింది. SEP 20న ఢిల్లీలో జిల్లా అధికారులు అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా అధికారులను CM చంద్రబాబు అభినందించారు.
Similar News
News August 15, 2025
రాష్ట్రంలో ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

AP: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో ఇల్లాలు. శ్రీకాకుళం(D) పాతపట్నంకు చెందిన నల్లి రాజు, మౌనికకు వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల ఆమెకు ఉదయ్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. అతడి భోజనంలో నిద్రమాత్రలు కలిపి, ప్రియుడితో పాటు మరొకరితో కలిసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. పోలీసుల దర్యాప్తులో విషయం బయటపడింది.
News August 15, 2025
కృష్ణా, గోదావరి నదుల్లో వాటా సాధిస్తాం: రేవంత్

TG: కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్ర వాటాను సాధించి తీరుతామని CM రేవంత్ పునరుద్ఘాటించారు. ‘ఒత్తిడికి లొంగేది లేదు. మన ప్రాంతానికి సాగునీరు అందిస్తాం. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. కానీ గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కూలి గోదావరిలో కలిసింది. సెంటిమెంట్ల పేరిట చేస్తున్న కుట్రలను రైతులు తిప్పికొట్టాలి’ అని వ్యాఖ్యానించారు.
News August 15, 2025
క్షమాపణలు చెప్పిన మృణాల్ ఠాకూర్

సారీ చెబుతూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. గతంలో ఆమె బిపాషా బసుపై చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ వీడియో ఇటీవల వైరల్ అయింది. వాటిపై <<17400036>>బిపాషా<<>> కూడా స్పందించారు. దీంతో ఆమె పేరు చెప్పకుండా మృణాల్ క్షమాపణలు కోరారు. ‘19 ఏళ్ల వయసులో నేను ఎన్నో సిల్లీ విషయాలు మాట్లాడాను. అవి ఇతరులను బాధపెట్టాయని అర్థమైంది. ఎవరినీ బాడీషేమింగ్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ తప్పు జరిగింది’ అని రాసుకొచ్చారు.