News August 15, 2025
HYD: శ్రీకాంతా.. నీ అమరత్వం మరువం!

ఓ వైపు శరీరాన్ని మంటలు దహించివేస్తోన్న ఆ ఉద్యమకారుడి గొంతులో తెలంగాణ నినాదం ఆగలేదు. స్వరాష్ట్రం కోసం 2009 NOV 29న LBనగర్ చౌరస్తాలో శ్రీకాంతా చారి ఆత్మహుతితో ఉమ్మడి రాష్ట్రం ఉలిక్కిపడింది. గురిచేసింది. జనం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ‘జై తెలంగాణ’ అంటూ 5 రోజులు మృత్యువుతో పోరాడాడు. స్వరాష్ట్రం కోసం పరితపించి, ప్రాణాలు విడిచిన శ్రీకాంతాచారి జయంతి నేడు.
అమరుడా నీకు జోహర్లు.
Similar News
News August 15, 2025
HYD: హైడ్రాపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టండి: రంగనాథ్

హైడ్రాపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కమిషనర్ రంగనాథ్ ఖండించారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రాకు అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. పర్యావరణహిత నగర నిర్మాణమే లక్ష్యంగా తమ కృషి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
News August 15, 2025
గోల్కొండలో పంద్రాగస్టు వేడుకలు.. CM రాకతో బందోబస్తు

పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా గోల్కొండ కోట ముస్తాబైంది. ఉదయం 10 గంటలకు CM రేవంత్ రెడ్డి జెండా ఎగరేయనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచే రాందేవ్గూడ-గోల్కొండ కోట రూట్లో వాహనాలను అనుమతించడం లేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరికాసేపట్లో CM కోటకు చేరుకోనున్నారు.
News August 15, 2025
HYD: దశాబ్దాలుగా ఇబ్బందులే.. పట్టించుకోండి!

భారీ వర్షాల వల్ల మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు పారుతోంది. పోలీసులు ఈ వంతెనపై రాకపోకలను నిషేధించారు. అయితే, ఈ సమస్య దశాబ్దాలుగా ఉన్నప్పటికీ, దీనికి పరిష్కారం లభించలేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు 2023లో 6 లేన్ల వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 2024లో పనులు ప్రారంభించారు. ఏడాదిలోగా పూర్తవుతుందని చెప్పినా ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.