News August 15, 2025

‘సుదర్శన చక్ర మిషన్’ ప్రకటించిన ప్రధాని

image

ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. త్రివిధ దళాల ఆయుధ సంపత్తి పెంచడమే లక్ష్యంగా ‘సుదర్శన చక్ర మిషన్’ను ప్రకటించారు. దీని ద్వారా రానున్న పదేళ్లలో రక్షణ శాఖకు అత్యంత అధునాతన ఆయుధాలు అందిస్తామని చెప్పారు. తద్వారా ఆయన పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు పంపారు.

Similar News

News August 15, 2025

శిథిలాల కింద 500 మంది ఉండొచ్చు: ఫరూక్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్ కిష్త్వార్‌లో భారీ వరదల వల్ల 60మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే, శిథిలాల కింద 500 మంది వరకు చిక్కుకొని ఉంటారని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అయితే ఆ సంఖ్య వెయ్యికి పైగా ఉంటుందని పలువురు అధికారులు చెబుతున్నట్లు వివరించారు. ఇదో విషాదకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

News August 15, 2025

స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎప్పుడొస్తాయో?

image

మన దేశంలో విదేశాలకు చెందిన వాట్సాప్, యూట్యూబ్, ట్విటర్ (X), ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లదే హవా. అయితే మన యువత స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను రూపొందించాలని ప్రధాని మోదీ ఇవాళ పిలుపునిచ్చారు. గతంలో హైక్, చింగారి, కూ, మోజ్, రొపొసొ లాంటివి వచ్చినా ఎక్కువ రోజులు నిలబడలేకపోయాయి. యాప్ డిజైనింగ్‌లో లోపాలు, యూఐ లాంటి సమస్యలతో యూజర్లు వాటిని ఆదరించట్లేదు.

News August 15, 2025

OFFICIAL.. ‘కూలీ’కి భారీ కలెక్షన్స్

image

సూపర్‌స్టార్ రజినీకాంత్‌, లోకేశ్ కాంబోలో నిన్న రిలీజైన ‘కూలీ’ తొలిరోజు రూ.151 కోట్ల+ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక తమిళ సినిమాకు తొలిరోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పేర్కొంది. సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డులు సృష్టిస్తారని, తిరిగి వాటిని బద్దలు కొడతారని ఓ పోస్టర్‌ను పంచుకుంది. వరుసగా సెలవులు ఉండటంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్సుంది.