News August 15, 2025

స్వాతంత్ర్య సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి: CP

image

విజయవాడ: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ రాజశేఖర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలితమే ఈ స్వాతంత్ర్యమని, దాని ఫలాన్ని భారతీయులందరూ ఆనందంగా అనుభవిస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతి ఒక్కరూ దేశ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Similar News

News August 15, 2025

ఉత్తమ అవార్డు అందుకున్న DMHO పేడాడ జగదీశ్వర్రావు

image

విశాఖ జిల్లా DMHO పేడాడ జగదీశ్వర్రావు ఉత్తమ అవార్డును రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ అందించిన అవార్డుల్లో DMHO పేడాడ జగదీశ్వర్రావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది DMHOకు అభినందనలు తెలిపారు.

News August 15, 2025

బుమ్రాను ముఖ్యమైన మ్యాచుల్లోనే ఆడించాలి: భువనేశ్వర్

image

వర్క్‌లోడ్ విషయంలో బుమ్రాకు భువనేశ్వర్ మద్దతుగా నిలిచారు. ENG‌తో 5 టెస్టుల సిరీస్‌లో బుమ్రా మూడింట్లో మాత్రమే ఆడటంతో అతని పట్ల BCCI పక్షపాతం చూపిస్తోందన్న విమర్శలొచ్చాయి. దీనిపై భువి స్పందిస్తూ ‘ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో ఆడుతూ ఫిట్‌గా ఉండటం కష్టం. అతడు ఏం చేయగలడో సెలక్టర్లకు తెలుసు. బుమ్రా ఎక్కువ కాలం ఆడాలని కోరుకుంటే అతడిని IMP మ్యాచుల్లోనే ఆడించాలి’ అని అభిప్రాయపడ్డారు.

News August 15, 2025

‘ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వ పాలన’

image

ఖమ్మం: ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలో నూతనంగా 24 వేల 818 కుటుంబాలకు రేషన్ కార్డ్‌లు జారీ చేశామని చెప్పారు. 3,37,898 మంది రైతుల ఖాతాలో రూ. 427 కోట్ల 38 లక్షల రైతు భరోసా నిధులు జమ చేసామని తెలిపారు. అలాగే జిల్లాలో 16 వేల 153 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.