News August 15, 2025
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం: మంత్రి

జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేద్దామని మంత్రి టీజీ భరత్ అన్నారు. 79వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కర్నూలులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీతో కలిసి జాతీయ జెండాని ఎగరేశారు. అనంతరం వివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
Similar News
News August 15, 2025
కర్నూలు జిల్లాలో ఫ్రీ జర్నీ షురూ

కర్నూలు జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. ఆదోనిలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, టీడీపీ నేత మీనాక్షి నాయుడు, కూటమి నేతలు ఉచిత బస్సులను ప్రారంభించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో.. ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు.
News August 15, 2025
విద్యార్థుల సంక్షేమం కోసం మంత్రి లోకేశ్ కృషి: ఎంపీ

కర్నూలు మండలం పంచలింగాలలో పలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం మంత్రి లోకేశ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
News August 15, 2025
కర్నూలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు

79వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కలెక్టర్ పి.రంజిత్ బాషా తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్ర నేటి యువతరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకట్ నారాయణమ్మ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.