News August 15, 2025
HYD: జాతీయ జెండా ఆవిష్కరించిన మేయర్ విజయలక్ష్మి

ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేయర్ మాట్లాడుతూ.. మన అందరి నినాదం జాతీయత అయి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Similar News
News August 15, 2025
HYD: సహజవనరుల పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి: కమిషనర్

సహజ వనరుల పరిరక్షణ అందరి లక్ష్యంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలా చేస్తేనే మెరుగైన జీవనం సాధ్యమని చెప్పారు. శుక్రవారం HYDలోని హైడ్రా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(జి)లో సహజ వనరుల సంరక్షణను ప్రస్తావించారని, దాని ప్రకారమే నగరంలోని గొలుసుకట్టు చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోందని తెలిపారు.
News August 15, 2025
HYD: సహజవనరుల పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి: కమిషనర్

సహజ వనరుల పరిరక్షణ అందరి లక్ష్యంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలా చేస్తేనే మెరుగైన జీవనం సాధ్యమని చెప్పారు. శుక్రవారం HYDలోని హైడ్రా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(జి)లో సహజ వనరుల సంరక్షణను ప్రస్తావించారని, దాని ప్రకారమే నగరంలోని గొలుసుకట్టు చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోందని తెలిపారు.
News August 15, 2025
సిద్దిపేట: కోమటి చెరువులో మృతదేహం గుర్తింపు

సిద్దిపేటలోని కోమటి చెరువు దక్షిణ ద్వారం మత్తడి వద్ద నీటిలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి లభ్యమైనట్టు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 35-40 ఏళ్లు ఉంటాయన్నారు. నైట్ ట్రాక్ పాయింట్, ఆఫ్ హ్యాండ్ పర్పుల్ కలర్ టీ షర్టు ధరించి ఉండగా, కుడి చేతకి మూడు వరసల జపమాల రాఖీ కట్టి ఉందని వివరించారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 8712667311, 8712667450 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.