News August 15, 2025

స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎప్పుడొస్తాయో?

image

మన దేశంలో విదేశాలకు చెందిన వాట్సాప్, యూట్యూబ్, ట్విటర్ (X), ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లదే హవా. అయితే మన యువత స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను రూపొందించాలని ప్రధాని మోదీ ఇవాళ పిలుపునిచ్చారు. గతంలో హైక్, చింగారి, కూ, మోజ్, రొపొసొ లాంటివి వచ్చినా ఎక్కువ రోజులు నిలబడలేకపోయాయి. యాప్ డిజైనింగ్‌లో లోపాలు, యూఐ లాంటి సమస్యలతో యూజర్లు వాటిని ఆదరించట్లేదు.

Similar News

News August 15, 2025

APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

TG: స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 118 పోస్టులను భర్తీ చేయనుంది. వేతనాలు, అర్హతలు, ఎంపిక విధానానికి సంబంధించిన వివరాలు అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉన్నట్లు చెప్పింది. రాత పరీక్ష‌లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా నియామకాలు చేపడుతారు. 200 మార్కుల చొప్పున పేపర్​-1, పేపర్-2 పరీక్షలుంటాయి.

News August 15, 2025

బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు!

image

బొప్పాయిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘అందులోని పొటాషియం రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయులను మెరుగుపరుస్తుంది. విటమిన్ A, Eలు చర్మ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. శరీరంలోని మలినాలను బయటికి పంపే ఔషధ గుణాలూ బొప్పాయి సొంతం. ఉదయం దీన్ని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణ సమస్యలు దరిచేరవు. అధిక ఫైబర్ మలబద్దకాన్ని దూరం చేస్తుంది’ అని వివరిస్తున్నారు.

News August 15, 2025

సరదా సన్నివేశం: ‘పవనన్నా! డబ్బులు నేనిస్తా’

image

AP: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభోత్సవంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్ స్టేషన్ వరకు బస్సులో వెళ్లారు. ‘విజయవాడకు మూడు టికెట్లు ఇవ్వండి’ అని పవన్ కండక్టర్‌ను అడిగారు. అక్కడే ఉన్న లోకేశ్ ‘పవనన్నా! డబ్బులు నేనిస్తా’ అని అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి.