News August 15, 2025
శిథిలాల కింద 500 మంది ఉండొచ్చు: ఫరూక్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్ కిష్త్వార్లో భారీ వరదల వల్ల 60మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే, శిథిలాల కింద 500 మంది వరకు చిక్కుకొని ఉంటారని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అయితే ఆ సంఖ్య వెయ్యికి పైగా ఉంటుందని పలువురు అధికారులు చెబుతున్నట్లు వివరించారు. ఇదో విషాదకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Similar News
News August 15, 2025
APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TG: స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 118 పోస్టులను భర్తీ చేయనుంది. వేతనాలు, అర్హతలు, ఎంపిక విధానానికి సంబంధించిన వివరాలు అధికారిక <
News August 15, 2025
బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు!

బొప్పాయిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘అందులోని పొటాషియం రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయులను మెరుగుపరుస్తుంది. విటమిన్ A, Eలు చర్మ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. శరీరంలోని మలినాలను బయటికి పంపే ఔషధ గుణాలూ బొప్పాయి సొంతం. ఉదయం దీన్ని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణ సమస్యలు దరిచేరవు. అధిక ఫైబర్ మలబద్దకాన్ని దూరం చేస్తుంది’ అని వివరిస్తున్నారు.
News August 15, 2025
సరదా సన్నివేశం: ‘పవనన్నా! డబ్బులు నేనిస్తా’

AP: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభోత్సవంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్ స్టేషన్ వరకు బస్సులో వెళ్లారు. ‘విజయవాడకు మూడు టికెట్లు ఇవ్వండి’ అని పవన్ కండక్టర్ను అడిగారు. అక్కడే ఉన్న లోకేశ్ ‘పవనన్నా! డబ్బులు నేనిస్తా’ అని అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి.