News August 15, 2025
73 లక్షల మందికి సేవలు: పృథ్వీతేజ్

విశాఖ ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఛైర్మన్ పృథ్వితేజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ పరిధిలో 73 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని తెలిపారు. 19,385 మంది వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు అమర్చామన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 97 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
Similar News
News August 15, 2025
విశాఖలో 250 మంది బిచ్చగాళ్లకు షెల్టర్

రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ సీపీ నగరంలో బిక్షటాన చేస్తున్న 250 మందిని తీసుకువచ్చి షెల్టర్ కల్పించారు. చోడుపల్లి పైడమ్మ (77) శ్రీహరిపురంలో ఎండు చేపలు అమ్ముతూ ఉండేది. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుమారుడు సాంబమూర్తి వెతకడం ప్రారంభించాడు. అయితే పోలీసులు చేసిన స్పెషల్ డ్రైవ్లో ఆమె పట్టుబడింది. పోలీసుల సంరక్షణలో ఉన్న ఆమెను శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News August 15, 2025
విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన యువకుడి మృతి

విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన యువకుడి మృతదేహం 24 గంటల తర్వాత తీరానికి శుక్రవారం కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారం మేరకు మత్స్యకారులు, పోలీసుల సహకారంతో మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News August 15, 2025
విశాఖలో గృహనిర్మాణశాఖ శకటానికి ప్రథమ బహుమతి

విశాఖలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖకు ప్రథమ స్థానం, జీవీఎంసీ శకటానికి ద్వితీయ స్థానం, విద్యాశాఖ శకటానికి తృతీయ స్థానం లభించింది. మరికొన్ని ప్రభుత్వ శకటాలు కూడా ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.