News August 15, 2025

GST శ్లాబ్స్ 5 నుంచి 2కి తగ్గింపు?

image

ప్రస్తుతం <<17409983>>GST<<>>లో 5 శ్లాబ్స్ (0%, 5%, 12%, 18%, 28%) ఉండగా కేంద్రం వాటిని 2కి (5%, 18%) తగ్గించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. లగ్జరీ, సమాజానికి హాని చేసే పొగాకు, పాన్ మసాలా లాంటి ఐటమ్స్‌ను ప్రత్యేకంగా 40% జీఎస్టీలోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 12% శ్లాబ్‌లో ఉన్న 99 శాతం వస్తువులను 5% శ్లాబ్‌లోకి, 28% శ్లాబ్‌లో ఉన్న 90 శాతం వస్తువులను 18% శ్లాబ్‌లోకి మార్చే ఛాన్స్ ఉంది.

Similar News

News August 16, 2025

మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా అక్కడ బంద్‌కు పిలుపు

image

TG: మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. నార్త్ ఇండియా నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మార్వాడీలు అన్ని వ్యాపారాలకు విస్తరిస్తున్నారని, వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తుండటంతో స్థానికులకు ఉపాధి లభించట్లేదంటున్నారు. ఈ నేపథ్యంలో AUG 18న రంగారెడ్డి(D) ఆమనగల్లు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు లోకల్ వ్యాపారులు ప్రకటించారు.

News August 15, 2025

PHOTO GALLERY: రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’

image

AP: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఇచ్చిన తేనీటి విందులో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా దంపతులు పాల్గొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్, మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

News August 15, 2025

ట్రంప్, పుతిన్ మధ్య కనీసం 6-7గంటలు చర్చలు!

image

అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ కాసేపట్లో అలాస్కా వేదికగా భేటీ కానున్నారు. వీరి మధ్య కనీసం 6-7గంటల పాటు వివిధ అంశాలపై చర్చ జరగనున్నట్లు రష్యా అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీ ఫలప్రదం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఇరుదేశాధినేతల మధ్య ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించే చర్చ జరగనున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.