News August 15, 2025
PHOTO GALLERY: రాజ్ భవన్లో ‘ఎట్ హోమ్’

AP: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఇచ్చిన తేనీటి విందులో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా దంపతులు పాల్గొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్, మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Similar News
News August 16, 2025
జగన్ జెండా ఆవిష్కరించకపోవడం విచారకరం: ధూళిపాళ్ల

AP: నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా YS జగన్ జాతీయ జెండా ఆవిష్కరణకు బయటకు రాకపోవడం శోచనీయమని TDP MLA ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ‘ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగురవేయని మాజీ CMగా, పార్టీ చీఫ్గా నిలిచారు. ఇలా చేయడం దేశాన్ని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని, జెండాను అవమానించడమే. పులివెందుల ఓటమి ఫ్రస్ట్రేషన్ దీనికి కారణం కావొచ్చు. జగన్ జెండా ఆవిష్కరించకపోవడం విచారకరం’ అని Xలో మండిపడ్డారు.
News August 16, 2025
భారత్కు వస్తున్న శుభాంశు శుక్లా

భారత్ తరఫున అంతరిక్షానికి వెళ్లొచ్చిన తొలి వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి వస్తున్నారు. ఇన్నిరోజులు అమెరికాలోని NASA పర్యవేక్షణలో ఉన్న ఆయన భారత్కు పయనమయ్యారు. ఇక్కడికి వచ్చాక ప్రధాని మోదీతో శుక్లా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక యాక్సియం-4 మిషన్ కోసం ఇన్నాళ్లు కుటుంబం, స్నేహితులకు దూరంగా ఉండటం బాధించిందని ఆయన తెలిపారు. వారిని కలిసి తన అనుభవాలను పంచుకునేందుకు ఆత్రుతగా ఉన్నట్లు వెల్లడించారు.
News August 16, 2025
RED ALERT: అత్యంత భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.