News April 1, 2024

42.4°డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!

image

భానుడి ప్రతాపంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి భగభగలతో బెంబేలెత్తుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే క్రమేణా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడుగులపల్లి మండలంలో సండే రోజు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 7, 2026

ఇండియన్ టీమ్‌కు గట్టుప్పల్ అమ్మాయి సెలెక్ట్

image

అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గట్టుప్పల్ మండలానికి చెందిన పగిళ్ళ చందన ఎంపికైంది. భారత్ – థాయ్‌లాండ్ మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నెల 11 నుంచి 15 వరకు థాయ్‌లాండ్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. సీనియర్ క్రీడాకారిణిగా చందన అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 7, 2026

నల్గొండకు నేడు ముగ్గురు మంత్రుల రాక

image

నల్గొండ కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అభివృద్ధి పనులపై సమీక్షించనున్న ఈ భేటీ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

News March 6, 2026

NLG: ఇంటర్ పరీక్షలకు 261 మంది గైర్హాజరు

image

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 9,796, మంది విద్యార్థులకు గాను 9,620 మంది హాజరుకాగా, 176 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1938 మంది విద్యార్థులకు గాను 1853 మంది హాజరుకాగా, 85 మంది గైర్హాజరయ్యారు.