News April 1, 2024
42.4°డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!

భానుడి ప్రతాపంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి భగభగలతో బెంబేలెత్తుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే క్రమేణా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడుగులపల్లి మండలంలో సండే రోజు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News September 9, 2025
NLG: ప్రజావాణిలో ఈ ఫిర్యాదులే అధికం..!

కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కిటకిటలాడింది. తమ గోడును చెప్పుకునేందుకు వందల సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. మండలాల్లో గ్రీవెన్స్ డే ఉన్నా, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ప్రజలు నేరుగా కలెక్టరేట్కు వచ్చారు. సోమవారం 87 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికశాతం భూ సమస్యలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినవే ఉన్నాయి. బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
News September 9, 2025
నల్గొండలో న్యాయవాదుల విధులు బహిష్కరణ

నల్లగొండ జిల్లాలో న్యాయవాది వెంకటయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనతో కోర్టు కార్యకలాపాలు స్తంభించాయి.
News September 9, 2025
NLG: తుది ఓటరు జాబితా విడుదలకు కసరత్తు!

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితాను బుధవారం విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 33 మండలాల్లో 33 జడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచించారు.