News August 16, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
> జనగామ: చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన
> కొడకండ్ల: పొలంలో జాతీయ జెండా ఎగరవేత
> స్టేషన్ ఘనపూర్: డిప్యూటీ వార్డెన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
> పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే
> బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న దేవరుప్పుల ఎస్సై
> బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న పాలకుర్తి ఆర్ఐ

Similar News

News August 16, 2025

కురుపాం: ఆంగార కాయలకు భలే గిరాకీ..!

image

కురుపాం ఏజెన్సీ ప్రాంతంలోని ముఠా గ్రామాల్లో వర్షాకాలంలో పండే ఆంగార కాయలకు మంచి గిరాకీ ఉంది. ఏడాదికి ఒక సారి పండే అంగార కాయలు నాణ్యత, పరిమాణం బట్టి కిలో ధర రూ.160 నుంచి 210 పలుకుతోందని గిరిజనలు తెలిపారు. ఆంగాక కాయల కూరలతో కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం. వీటిని దళారులు కొండపై గ్రామాలకు వెళ్లి అక్కడ తక్కువ ధరకు కొని మైదాన ప్రాంతంలో అధిక ధరలకు అమ్ముతున్నారని వారు వాపోయారు.

News August 16, 2025

ఈ ఏడాది 13,260 మందిపై కేసులు: VZM SP

image

ఈ ఏడాది ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 13,260 మందిపై కేసులు నమోదు చేశామని SP వకుల్ జిందల్ శనివారం తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని, దొరికిన వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

News August 16, 2025

అమరావతి ఐకానిక్ టవర్ల పునాదుల్లో నీరు చేరటానికి కారణమిదే!

image

అమరావతి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఐకానిక్ టవర్ల పునాదులు 1, 2లో భారీగా నీరు చేరింది. రాయపూడి నుంచి వస్తున్న పాలవాగు బ్రాంచ్ కెనాల్ నీరు దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. వరద నీరు నిలవకుండా మూడు రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. వర్షాకాలానికి అనుగుణంగా పనులు చేపట్టినందున ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు.