News August 16, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 2,638 టన్నుల యూరియా

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 2,638.44 టన్నుల యూరియా గూడ్స్ వ్యాగన్ల ద్వారా చేరుకుంది. చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్ వద్దకు వచ్చిన యూరియాను ఖమ్మం జిల్లాకు 1,538.44 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,000 టన్నులు, సీఆర్పీ ఖమ్మంకు 100 టన్నులు చొప్పున బదిలీ చేసినట్లు రేక్ పాయింట్ టెక్నికల్ అధికారి పవన్‌కుమార్ తెలిపారు. ఈ యూరియాను రైతులకు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

Similar News

News August 17, 2025

గంగారాం: రోడ్డు మీద కూర్చొని భోజనం చేసిన SI

image

రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గంగారం మండల కేంద్ర సమీపాన కొత్తగూడ వెళ్లే రహదారిపై వర్షపు నీటితో పెద్దఎత్తున గుంతలుపడ్డాయి. సమాచారం అందుకున్న ఎస్సై రవికుమార్ అక్కడికి చేరుకున్నారు. ఆ గుంతలు లేకుండా సరిచేశారు. అనంతరం తమతో పనిలో సహాయం చేసిన మిత్రులతో కలిసి రోడ్డుపై భోజనం చేశారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను ఎస్సై నెమరవేసుకున్నారు.

News August 17, 2025

US టీమ్ భారత పర్యటన రద్దు?

image

భారత్-అమెరికా మధ్య ఆరో విడత వాణిజ్య చర్చలను కొనసాగించేందుకు ఈ నెల 25న యూఎస్ బృందం ఢిల్లీ రావాల్సి ఉంది. కానీ యూఎస్ ప్రతినిధుల టూర్ రద్దైనట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతల్లో చర్చలు కొనసాగాయి. చివరి రౌండ్ చర్చలు వాషింగ్టన్‌లో భారత చీఫ్ నెగోషియేటర్ రాజేశ్ అగర్వాల్, యూఎస్ ప్రతినిధి బ్రెండన్ లించ్‌ మధ్య జరిగాయి.

News August 17, 2025

KMR: జాతీయ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ బాలు

image

కామారెడ్డికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వ్యక్తిగతంగా 77 సార్లు రక్తదానం చేసినందుకు ఐవీఎఫ్ జాతీయ పురస్కారాన్ని ఈ నెల 19న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చేతుల మీదుగా న్యూఢిల్లీలో అందుకోనున్నట్లు ఆయన చెప్పారు.