News August 16, 2025
KMR: జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గతేడాది 170 రోడ్డు ప్రమాదాల్లో 179 మంది మరణించగా, 315 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఇదే కాలంలో 1129 ప్రమాదాలలో 135 మంది మరణించగా, 272 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణలో కామారెడ్డి జిల్లా పోలీసులు సాధించిన ఈ పురోగతిని రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ అభినందించారు.
Similar News
News August 16, 2025
HYD: అదుపుతప్పిన వాహనం.. కిందపడిపోయిన విగ్రహం

ఆరాంఘర్ శివారు మార్గంలో శనివారం రోడ్డుపై గణేశ్ విగ్రహం పడిపోయింది. వాహనం అదుపుతప్పి విగ్రహం ఒకేవైపు ఒరిగి, కిందపడిపోయినట్లు వాహనదారులు తెలిపారు. రోడ్డుకు అడ్డుగా భారీ ప్రతిమ పడిపోవడంతో ఆ రూట్లో ట్రాఫిక్ జామైంది. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. మండపానికి తీసుకెళ్తుంటే ఊహించని సంఘటన ఎదురైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
News August 16, 2025
ప్రజలు సహకరించాలి: నిర్మల్ ఎస్పీ

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని ఎస్పీ జానకీ షర్మిల విజ్ఞప్తి చేశారు. కడెం, స్వర్ణ ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గేట్లు తెరుస్తున్నారని తెలిపారు. పశువులకాపరులు, మత్స్యకారులు దిగువ ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. జలాశయాల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
News August 16, 2025
బ్రెవిస్కు ఎక్స్ట్రా పేమెంట్.. CSK క్లారిటీ

IPL-2025లో ఆడేందుకు <<17405212>>బ్రెవిస్కు<<>> ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారన్న మాజీ క్రికెటర్ అశ్విన్ వ్యాఖ్యలపై CSK స్పందించింది. ‘టోర్నీ నియమాలకు లోబడే గాయపడిన గుర్జప్నీత్ సింగ్ స్థానంలో బ్రెవిస్ను తీసుకున్నాం. రూల్ ప్రకారం రీప్లేస్మెంట్ ప్లేయర్కు ఇంజూర్డ్ ప్లేయర్కు ఇవ్వాల్సిన ఫీ కంటే ఎక్కువ ఇవ్వొద్దు. దాని ప్రకారమే వేలంలో గుర్జప్నీత్ను కొన్న ధరనే (₹2.2Cr) బ్రెవిస్కు చెల్లించాం’ అని స్పష్టం చేసింది.