News August 16, 2025

ఉప్పునుంతలలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటలలో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా ఉప్పునుంతల మండలంలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. పెద్దకొత్తపల్లి మండలంలో 15.2, బిజినేపల్లిలో 12.8, ఊరుకొండలో 12.6, కల్వకుర్తిలో 10.4, లింగాలలో 8.6, అచ్చంపేటలో 8.2, వెల్దండలో 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

Similar News

News August 16, 2025

పెగడపల్లి: సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా భూమేశ్వర్

image

జగిత్యాల జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శిగా పెగడపల్లి మండలం కీచులాటపల్లికి చెందిన ఇరుగురాల భూమేశ్వర్ నియమితులయ్యారు. శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో భూమేశ్వర్‌ను పార్టీ నాయకులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భూమేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొంటూ, తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

News August 16, 2025

గుంటూరులో విషాదం.. ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య

image

గుంటూరులోని సాయిబాబా నగర్‌లో దారుణం జరిగింది. నరసరావుపేటలో ఆటో డ్రైవర్‌‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో తన ఇద్దరు మగ పిల్లలను తీసుకుని శనివారం సాయిబాబా నగర్‌లో ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 16, 2025

మంచిర్యాలలో వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన

image

భారీ వర్షాల కారణంగా మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం సందర్శించారు. మంచిర్యాలలోని రాళ్లవాగు, లక్షెట్టిపేట పరిధిలోని గంపలపల్లి, కొమ్ముగూడెం, గోదావరి నది పరీవాహక ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంతెనలు, ప్రధాన రహదారులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వివిధ శాఖలతో సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.